Teacher Recruitment Notification TRT 2017 Notification ఈ నెల 30 వరకు టీఆర్టీ దరఖాస్తు గడువు పొడిగింపు
సవరణ ఉత్తర్వులు జారీ..
నేడు సవరణ నోటిఫికేషన్
♦టీచర్ రికూట్ర్మెంట్ టెస్టు దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు టీఎ్సపీఎస్సీ పొడగించనున్నది. 31 జిల్లాల ప్రకారం టీచర్ పోస్టుల భర్తీ చెల్లదని, 10 జిల్లాల ప్రకారమే భర్తీ చేయాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు భర్తీ విధానం, విద్యార్హతలను సవరిస్తూ జీవో నంబరు 25ను సోమవారం రాత్రి విద్యాశాఖ ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి సీఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య జారీ చేశారు. 31 జిల్లాలకు బదులు 10 జిల్లాలుగా మార్చడంతోపాటు 31 జిల్లాల్లో టీచర్ల అపాయింటింగ్ అఽథారిటీగా డీఈవోకు అధికారం ఇచ్చారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టే నియామకాల్లో పాత 10 జిల్లాల్లో నియమించిన అధికారికే నియామక అధికారం ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
♦దీని ప్రకారం పాత జిల్లాల్లోని సాంక్షన్డ్ డీఈవో పోస్టులో పనిచేస్తున్న డీఈవోకే నియామక బాధ్యతలు అప్పగించనున్నారు. కాగా.. హైకోర్టు ఆదేశాల ప్రకారం విద్యాశాఖ సవరణ ఉత్తర్వుల జారీలో జాప్యం ఏర్పడడంతో టీఎ్సపీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి.. విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో ఫోన్లో మాట్లాడారు. దీంతో కడియం ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవరణ ఉత్తర్వులు జారీ చేశారు.
♦ దీని ఆధారంగా టీఎ్సపీఎస్సీ మంగళవారం అధికారికంగా నోటీఫికేషన్ జారీ చేస్తుందని చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. 30వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు పొడిగిస్తామని చెప్పారు. 2018 జనవరి 24 నుంచి రాత పరీక్షలు నిర్వహించి.. మార్చి నెలాఖరు నాటికి నియామక ప్రక్రియ పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నామని చక్రపాణి వివరించారు.
Click Here to Download Complete TRT Notification
Click Here for Online Application Form Submission